లలిత్ పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనాటు ప్రధాని నిర్ణయం...! 1 y ago
ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ పసిఫిక్ ద్వీప దేశమైన వనాటుకు మకాం మార్చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. లలిత్ మోదీ ఐపీఎల్ బాస్ ఉన్న సమయంలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశాడని అతడిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో భారత అధికారులకు దొరకకుండా గత 15 ఏళ్లుగా లండన్లో తల దాచుకున్నాడు. ఆ దేశానికి చెందిన గోల్డెన్ పాస్పోర్టును తీసుకున్నట్లు సమాచారం. ఆయనకు జారీ చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనాటు ప్రధాని జోథం నపాట్ పౌరసత్వ కమిషన్ ను ఆదేశించినట్లు అధికారులు -వెల్లడించారు.